వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాక్ష్యాధారాలతో మీడియా ముందుకు దిగ్విజయ్ సింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Digvijay Singh
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటిఎస్) చీఫ్ హేమంత్ కర్కరే చనిపోక ముందు తనకు ఫోన్ చేశారని ఇన్నిరోజులు చెప్పుకుంటూ వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ మంగళవారం పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వచ్చారు. తాను ఎలాంటి అబద్దాలు చెప్పలేదని తనకు కర్కరే ఫోన్ చేసిన విషయం నిజమేనని తాను పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానని చెప్పారు. ఇప్పటికైనా తన ఆరోపణలను ఖండించిన వారు తనకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

2008వ సంవత్సరంలో గత ముంబయి దుర్ఘటనకు ముందు నవంబర్ 26వ తేదిన కర్కరే తనకు ఫోన్ చేశారని చెప్పారు. తనకు హిందూ మతతత్వ సంస్థల నుండి ముప్పు ఉన్న విషయాన్ని చెప్పారన్నారు. సంభాషణ రికార్డులను ఆయన మీడియా ముందు ఉంచారు. తనకు దురుద్దేశ్యాలను అంటగట్టిన వారంతా క్షమాపణలు చెప్పాలన్నారు. బిఎస్ఎన్ఎల్ నుండి తాను ఆధారాలు సంపాదించినట్టు చెప్పారు. మాలేగావ్ పేలుళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీలనుండి తనకు ఒత్తిళ్లు వచ్చాయని కర్కరే తనకు ఆ ఫోన్లో చెప్పారన్నారు. తనకు కర్కరే ఫోన్ చేసినట్టు చెప్పిన దానిపై మంత్రి ఆర్.ఆర్.పాటిల్ సందేహాలు వ్యక్తం చేయటం తనకు బాధ కలిగించిందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X