హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కమిటీ పేరుతో కేంద్రం కుట్ర, శ్రీకృష్ణతో ఏడాది వృథా: కోదండరామ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏడాది కాలాన్ని వృథా చేసిందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ బుధవారం ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రకటించాలని కోరుతూ తెలంగాణ ప్రాంతాల్లోని ఎమ్మార్వో కార్యాలయాల ముందు రాజకీయ జెఏసి ధర్నాను నిర్వహిస్తోంది. కోదండరామ్ సరూర్‌నగర్ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కేంద్రం వెంటనే తెలంగాణ ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

కేంద్రం అఖిలపక్షం పేరుతో సమస్యను మళ్లీ తెచ్చే కుట్ర చేస్తుందన్నారు. అఖిలపక్షం పేరుతో ఒక్కో పార్టీనుండి ఇద్దరిని పిలవటం సబబు కాదన్నారు. ఇద్దరిని పిలవడం వల్ల ఫలితం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కమిటీలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అఖిలపక్షానికి తెలుగుదేశం పార్టీ వెళ్లకూడదని కోదండరామ్ డిమాండ్ చేశారు. పార్లమెంటులో బిల్లు పెట్టడానికి అన్ని పార్టీల వారు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఈనెల, వచ్చేనెలలో దశలవారీగా ఉద్యమాలు చేస్తామని ఆయన చెప్పారు. బిల్లు పెట్టే వరకు తమ ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X