వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీకృష్ణ నివేదిక పరిగణలోకి తీసుకుంటాం: సిఎం కిరణ్‌తో అహ్మద్ పటేల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ahmed Patel
న్యూఢిల్లీ: తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ బుధవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోనియాగాంధీతో సమావేశమైన సమయంలో అహ్మద్ పటేల్ కూడా ఉన్నారు. తెలంగాణ అంశంపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేడో రేపో రానుందని, ఆ రిపోర్టు వచ్చాక ఫలితం ఉంటుందన్నారు. జనవరి 6వ తేదిన హోంమంత్రి చిదంబరం ఏర్పాటు చేసే అఖిలపక్షానికి అందరూ రావాలని ఆయన భేటీలో ఆకాంక్షించారు. భేటీ తర్వాత నివేదిక బహిర్గతం అవుతుందని అప్పుడు రాష్ట్రంలోని పరిణామాలు పరిశీలిస్తామన్నారు.

అఖిలపక్షానికి తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు కూడా రావాలని ఆయన కోరారు. సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అయిన సందర్భంలో పటేల్ అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. అందులో తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమిటి, లాభమేమిటో చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీలోనే ఉన్న కాంగ్రెస్ నేతల, కార్యకర్తల వల్ల ఎలాంటి సమస్య వస్తుందనేది కూడా వారు ఆలోచించినట్టు తెలుస్తోంది. ప్రాణహిత - చేవెళ్ల, పోలవరం జాతీయహోదాపై కూడా వారు చర్చించినట్టు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X