హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ బిల్లు పెట్టకుంటే పదవీ త్యాగాలు: కాంగ్రెసు తెలంగాణ నేతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించకపోతే పదవీ త్యాగాలకు సిద్ధపడాలని కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధుల సమావేశంలో నిర్ణయించింది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై, తమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించుకోవడానికి తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు శుక్రవారం సమావేశమయ్యారు. సమావేశంలో మూడు తీర్మానాలు చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని, లేకుంటే పదవీ త్యాగాలకు సిద్ధపడాలని వారు తీర్మానించారు. తెలంగాణ నుంచి కేంద్ర బలగాలను ఉపసంహరించుకోవాలని, మీడియాపై విధించిన ఆంక్షలను ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ వారు మరో రెండు తీర్మానాలు చేశారు.

తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసుకోవడానికి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి 29 మంది శాసనసభ్యులు, 9 మంది ఎమ్మెల్సీలు, ఏడుగురు పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు. మంత్రులు కె. జానారెడ్డి, బసవరాజు సారయ్య, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ప్రతినిధులు వచ్చి ధర్నా నిర్వహించారు. మీడియాపై విధించిన ఆంక్షలను ఎత్తేయించాలని వారు కాంగ్రెసు నాయకులను డిమాండ్ చేశారు. అందుకు కాంగ్రెసు నాయకులు సానుకూలంగా ప్రతిస్పందించారు. ఆ తర్వాత తెలంగాణ న్యాయవాదులు సమావేశంలోకి వచ్చి తెలంగాణ నాయకులను ఘెరావ్ చేశారు. నల్లగొండ జిల్లా కోదాడ శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని వారు చుట్టుముట్టారు. పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X