తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అఖిలపక్షంలో తెలంగాణకు శాశ్వత పరిష్కారం: రాఘవులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

BV Raghavulu
తిరుపతి: తెలంగాణ విషయంలో త్వరలో కేంద్రం మరోసారి ఏర్పాటు చేయనున్న అఖిలపక్ష సమావేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు శుక్రవారం తిరుపతిలో పేర్కొన్నారు. ఈ అఖిలపక్ష సమావేశంలో శాశ్వత పరిష్కారానికే కేంద్రం మొగ్గు చూపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లేదంటే రాష్ట్ర ప్రజలను మళ్లీ గందరగోలంలోకి నెట్టినట్టు అవుతుందన్నారు. ఇప్పటికైనా ఏదో ఒక నిర్ణయం కేంద్రం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

రాష్ట్రంలోని పరిణామాలకు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలదే బాధ్యత అని అన్నారు. తెలంగాణ విషయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుందన్నారు. పార్టీ పరంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. అంతర్ రాష్ట్ర జలవివాదాల్లో రాజ్యాంగ బద్దమైన శాశ్వత పరిష్కారం ఉండాలని రాఘవులు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X