వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ జిల్లాలో వైయస్ విగ్రహాలకు ఎసరు: జివిఎంసి ఆదేశాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
విశాఖపట్నం: విశాఖపట్నంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలపై మరోసారి వివాదం చెలరేగింది. జిల్లాలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 3వ తారీఖునుండి ఆయన ఓదార్పు ప్రారంభమయింది. తన ఓదార్పుయాత్రలో జగన్ వైయస్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ అభిమానులు పలు ప్రాంతాల్లో విగ్రహాలను ఏర్పాటు చేశారు.

అయితే కొన్ని ప్రాంతాల్లో వైయస్ విగ్రహాలు ఏర్పాటు చేయడంపై గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పోరేషన్(జివిఎంసి) అభ్యంతరం వ్యక్తం చేసింది. 12 వైయస్ విగ్రహాలపై జివిఎంసి అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. వాటిని వెంటనే తొలగించాల్సిందిగా హుకుం జారీ చేసింది. కాగా రెండు విగ్రహాలను తొలగించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X