హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూరి హత్య కేసు: మహారాష్ట్రకు పారిపోయిన భాను కిరణ్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న భాను కిరణ్ మహారాష్ట్రకు పారిపోయినట్లు భావిస్తున్నారు. సూరిని హత్య చేసిన వెంటనే భాను కిరణ్ తన మిత్రుల సహకారంతో పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అతను మొదట షోలాపూర్ చేరుకుని, ఆ తర్వాత ముంబైకి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రకు పోలీసు బృందాన్ని పంపినట్లు కూడా తెలుస్తోంది.

భాను కిరణ్ పారిపోవడానికి హైదరాబాదులో అతని మిత్రులు గణేష్, సుబ్బు సహకరించినట్లు చెబుతున్నారు. గణేష్‌ను ఇప్పటికే పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. సుబ్బ అలియాస్ సుబ్బయ్య కోసం పోలీసులు గాలిస్తున్నట్లు చెబుతున్నారు. భాను కిరణ్ పరారీకి మహబూబ్‌ నగర్ ‌కు చెందిన ఓ వ్యక్తి సహకరించినట్లు చెబుతున్నారు. సైబరాబాద్‌ కు చెందిన ఓ ఇన్ ‌స్పెక్టర్ కూడా భానుకు సహకరించినట్లు అనుమానిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X