హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ సెంటిమెంటు ఎందుకు వచ్చిందో: రాంరెడ్డి వెంకట్‌రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ramreddy Venkat Reddy
హైదరాబాద్: పార్టీ వేరు ప్రేమ వేరు అని తెలంగాణ సీనియర్ నాయకుడు మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదివారం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మీదున్న ప్రేమతో జగన్ వెంట ఇప్పుడు అభిమానం ఉండవచ్చని చెప్పారు. కాని అందరూ పార్టీతో ఉండటానికే ఇష్టపడతారని చెప్పారు. వైయస్ గురించి ఎవరూ అనవసరంగా మాట్లాడకూడదని సూచించారు. వ్యక్తిగతంగా తాను తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటున్నానని చెప్పారు. అయితే తెలంగాణ సెంటిమెంటు ఎందుకు వచ్చిందో మాత్రం అర్థం కావటం లేదన్నారు.

విద్యార్థుల సామాజిక భద్రతను ప్రశ్నించేలా ప్రభుత్వం వ్యవహరించ వద్దని మరో మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టరని ఇప్పుడే ఎలా ఊహించుకుంటామని ఆయన ప్రశ్నించారు. అయితే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టకుంటే మాత్రం రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X