2 నెలల్లో ఎవరెక్కడ ఉంటారో తెలుస్తుంది: జగన్ ఎమ్మెల్యేలపై కిరణ్

Kiran Kumar Reddy
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి వెంట వెళ్లే శాసనసభ్యులను పార్టీ అధిష్టానం గమనిస్తోందని వారిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సమావేశంలో అన్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు ఉంటాయని అయితే అందుకు కొంత సమయం పడుతుందన్నారు. కొందరు ఎమ్మెల్యేలు రెండు పడవలపైన కాలు పెడుతున్నారని అలాంటి వారి కదలికలపై కూడా పార్టీ కన్ను వేస్తున్నదని చెప్పారు. కాగా జగన్ వెంట వెళుతున్న ఎమ్మెల్యేలను బహిష్కరించాలని పలువురు నేతలు సమావేశంలో డిమాండ్ చేశారు. నామినేటెడ్ పోస్టుల గురించి కొందరు నేతలు అడగగా జిల్లాల వారిగా లిస్టు తీసుకున్న తర్వాత నియామకాలు ఉంటాయని పిసిసి అధ్యక్షుడు డిఎస్ వారికి సమాధానం చెప్పారు.

ఆయా ఎమ్మెల్యేలపై స్పష్టత వచ్చిన తర్వాత తప్పకుండా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కాంగ్రెసు‌కు 40 శాతం ఓటింగ్ ఉందని ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అన్నారు. ఎవరు బయటకు వెళ్లినా సమస్య లేదన్నారు. మన ముందు ప్రస్తుతం తెలంగాణ సమస్యతో పాటు మరో వ్యక్తి సమస్య ఉందని సిఎం చెప్పారు. అయితే కాంగ్రెసు పటిష్టంగా ఉంటుందని, ఒకరిద్దరు బయటకు వెళ్లినా సమస్య లేదన్నారు. నాకు రాజకీయాలు తెలుసునన్నారు. గతంలో జగన్ వెంట వెళ్లిన వారు కొందరు వెనక్కి తిరిగి వచ్చారని, మళ్లీ కొత్తగా కొందరు వెళుతున్నారన్నారు. రెండునెలల్లో ఎవరు ఎక్కడ ఉంటారో తెలుస్తుందన్నారు. పార్టీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు లేని చోట కాస్త సమస్యగానే ఉందని సిఎం అన్నారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+