వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని అపాయింట్‌ మెంట్ కోసం ఢిల్లీలో వైయస్ జగన్ వెయిటింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: కృష్ణా నీటిపై కేంద్రం ఏర్పాటు చేసిన బ్రజేష్ కమిటీ తీర్పు వల్ల ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ మంగళవారం దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద ధర్నా చేసిన మాజీ పార్లమెంటు సభ్యుడు జగన్ బుధవారం సాయంత్రం వరకు ఢిల్లీలోనే ఉండాలని నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రం వరకు ఢిల్లీలోనే ఉండి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్ అపాయింట్‌ మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మంగళవారం రాత్రి జలదీక్ష అర్దాంతరంగా ఆగిపోయిన తర్వాత జగన్ మధ్యాహ్నం సఫ్దర్‌జంగ్ స్టేషన్ నుండి ప్రత్యేక రైలులో అందరితో కలిసి బయలుదేరుతారన్నారు. అయితే ప్రధాని అపాయింట్‌మెంటు కోసం జగన్ మాత్రం అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. మంగళవారం జలదీక్షలో జగన్ ప్రధానిని లక్ష్యంగా చేసుకొని ప్రసంగించాడు.

ప్రధానికి ఆంధ్రప్రదేశ్ రైతుల పట్ల పట్టడం లేదని ఆరోపించారు. ఏపిలోని సమస్యలపై ప్రధానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. తాను వచ్చింది బల పరీక్షకు కాదని రాష్ట్ర ప్రజల సమస్యలను ప్రధాని దృష్టికి, కేంద్రం దృష్టికి తీసుకు రావడానికే వచ్చానని చెప్పారు. ప్రధాని అపాయింట్‌మెంటు కోసం ఇంతకుముందు ప్రయత్నాలు చేసినప్పటికీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై న్యాయం కోసం అపాయింట్‌మెంట్ ఇవ్వమని లేఖ రాసినా ఇప్పటి వరకు ప్రధాని స్పందించలేదని ఆరోపించారు. మంగళవారం ప్రధానిపై ఘాటుగా వ్యాఖ్యానించిన జగన్ బుధవారం మాత్రం అపాయింట్‌మెంట్ కోసం ప్రత్యేకంగా ఆగిపోవడం గమనార్హం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X