హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ రాజశేఖర రెడ్డి బంధువుననే నాపై ఆరోపణలు: క్రిష్టోఫర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Damodara Rajanarasimha
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బంధువును అయినందునే తనపై ప్రభుత్వం కక్ష్యపూరితంగా ఆరోపణలకు పాల్పడుతుందని ఉన్నత విద్యామండలి కార్యదర్శి క్రిష్టోఫర్ గురువారం ఆరోపించారు. వైయస్ బంధువు అనే ఒకే ఒక కారణంతో నన్ను లక్ష్యంగా చేసుకొని నాపై వేటుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆయన చెప్పారు. కావాలంటే విచారణ చేసుకోవాలని అన్నారు.

నేను ఏ తప్పు చేయలేదని అన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహా నన్ను సెలవులపై వెళ్లమని సూచిస్తున్నారని అన్నారు. అయితే తాను తప్పు చేయనందున తాను సెలవులపై వెళ్లేందుకు సిద్ధంగా లేనన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా కక్ష్య లేదన్నారు. నా పదవీ కాలం ఇంకా ఉంది. కాబట్టి ఉద్యోగాన్నీ వదలనని చెప్పారు. ఉద్యమాల్లో పాల్గొన్న అధ్యాపకుల వివరాలను ఆఫీసుల వారిగా సేకరించాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X