హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ వర్గం ఎమ్మెల్యేలను బెదిరించడానికే అనర్హత వేటు!: యనమల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yanamala Ramakrishnudu
హైదరాబాద్: సొంత పార్టీ శాసనసభ్యులను భయపెట్టడానికే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పరకాల శాసనసభ్యురాలు కొండా సురేఖ, కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ధ్వజమెత్తారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి వెంట వెళుతున్న కారణంగా ప్రభుత్వం వారిని బెదిరంచే చర్యల్లో భాగంగా ఇద్దరిపై వేటు వేయాలని చూస్తుందన్నారు.

రాష్ట్రపతి పాలనను తెలుగుదేశం పార్టీ కోరుకోవడం లేదని అన్నారు. నల్లపురెడ్డిపై స్పీకరుకు మేం ఎప్పుడో ఫిర్యాదు చేశామని అయితే ఇప్పుడు వారి రాజకీయ లాభాలకోసం వేటుకు పూనుకుంటున్నారన్నారు. అయినా ఎమ్మెల్యేలపై వేటు వేసే అర్హత ఉపసభాపతికి లేదని, కేవలం సభాపతికే ఉంటుందని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X