కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు నేతల రాజీనామా కోరుతూ వాటర్ ట్యాంక్ ఎక్కిన విద్యార్థులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Karimnagar
కరీంనగర్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెసు, తెలుగుదేశం తదితర పార్టీల శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లాలో 20 మంది తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన విద్యార్థులు వాటర్ ట్యాంకు ఎక్కారు. తెలంగాణ ప్రాంత నేతలు రాజీనామా చేసే వరకు తాము వాటర్ ట్యాంక్ దిగేది లేదని వారు హెచ్చరిస్తున్నారు. తమకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ముఖ్యమని అంటున్నారు.

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని వర్సింగాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజా ప్రతినిధులు వెంటనే రాజీనామా చేయకుంటే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. పోలీసులు, స్థానికులు వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఇటీవలే తెలంగాణ రాష్ట్ర కోసం టిడిపి, కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలంటూ కరీంనగర్ జిల్లాలోనే ఓ గ్రామ సర్పంచ్‌తో పాటు పలువురు వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపిన సంఘటన మరువకముందే అదే తీరులో వీరు నిరసన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X