హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గులాబీలతో గులాంనబీ ఆజాద్‌కు తెలంగాణవాదలు వినూత్న నిరసన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ప్రకటించాలంటూ కోరుతూ కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌కు తెలంగాణవాదులు గులాబీలతో వినూత్న నిరసన తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల ఆరోగ్యశాఖ సమావేశాల మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా ఆయన హైదరాబాద్ వచ్చారు. శుక్రవారంతో సమావేశాలు ముగుస్తున్నవి. అయితే ఆయన గురువారం హైదరాబాదులోని పార్కు హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన వస్తున్నారని తెలుసుకొని కొందరు తెలంగాణవాదులు ఆయనకు గులాబీ పూలతో నిరసన తెలిపారు.

కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణను ప్రకటించాలని ఆయన వారు కోరారు. పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. కాగా మీడియా సమావేశం సందర్భంగా పార్కు హోటల్ వారు మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. పార్కు హోటల్ యాజమాన్యం నిర్వాకం కారణంగా విలేకరులు మీడియా సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో ఆజాద్ సమావేశం రద్దయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X