శబరిమలలో తొక్కిసలాటలో 21 మంది ఆంధ్ర భక్తుల మృతి
ప్రకాశం జిల్లా చీరాల విఠల్నగర్ చెందిన రాజు, మంగు, రాంబాబు, సూరయ్య, గణేష్లుగా గుర్తించారు. మెదక్ జిల్లా గజ్వెల్కు చెందిన తండ్రీకొడుకులు రామచంద్ర, అరణ్లు ఉన్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం ఊటూరుకు చెందిన దొమ్మాటి సర్వేశం, కృష్ణా జిల్లా కౌతవరం గ్రామానికి చెందిన బత్తిన ప్రసాద్, నల్లగొండ జిల్లా హుజూర్నగర్కు చెందిన శ్రీను, కోదాడ కొమరబండకు చెందిన రాంబాబు ఉన్నట్లు గుర్తించారు. ఇతర జిల్లాకు చెందినవారు కూడా కొంత మంది మరణించినట్లు తెలుస్తోంది. మొత్తం 21 మంది ఆంధ్రప్రదేశ్కు చెందినవారని సమాచారం.
కాగా, ఆంధ్రప్రదేశ్కు చెందినవారి మృతదేహాలను విమానంలో హైదరాబాద్ తరలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వాటిని రోడ్డు మార్గంలో స్వస్థలాలకు పంపుతారు. కొన్ని మృతదేహాలను విమానం ద్వారా విశాఖపట్నానికి తరలిస్తున్నారు. శబరిమల తొక్కిసలాటలో ఇప్పటి వరకు మొత్తం 106 మంది మరణించినట్లు సమాచారం అందుతోంది.