Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విస్తరిస్తున్న బాక్టీరియా మహమ్మారి..: విలవిలలాడుతున్న వన్యప్రాణులు

Lion
ఇరాన్‌: ఇరాన్‌ లోని తెహ్రాన్ జూ (అటవీ మృగాల సంక్షరణ కేంద్రం)లో అంటు వ్యాధులు కలిగించే ప్రమాదకర బాక్టీరియా వన్యప్రాణులను, మృగరాజులను బలిగొంటుంది. ఇప్పటి వరకూ ఈ బాక్టీరియా బారినపడి 14 సింహాలు మృతి చెందినట్లు స్థానికి మీడియా వెల్లడించింది. ఈ బాక్టీరియా వ్యాధి పర్యాటకులకు సైతం సోకవచ్చునని ప్రభుత్వ రంగ మీడియా సంస్థ జామ్-ఈ జామ్ పేర్కొంది.

సింహాలు గ్లాండర్స్ (గుర్రాలకు సోకే ఒక అంటువ్యాధి) బారిన మృతి చెందినట్లు ఆ పత్రిక తెలిపింది. ఇతర జంతువులకు సైతం ఈ వ్యాధి సోకిందని, ఇది జంతువుల నుంచి మనుషులకు కూడా సోకే ప్రమాదముందని సదరు పత్రిక హెచ్చరించింది. జూలో వన్యప్రాణుల సంరక్షణ లోపం వల్ల సింహాలకు ఈ వ్యాధి సోకి ఉండవచ్చునని గుర్రాల వైద్యుడు హావ్‌మ్యాన్ మోలౌక్‌పౌర్ తెలిపారు. అయితే ఈ సింహాలు ఎప్పుడు మరిణించాయనే విషయాన్ని మాత్రం ఆ పత్రిక వెల్లడించలేదు.

గడచిన రెండు నెలలో ఇలాగే మూడు సింహాలు గ్లాండర్స్ వ్యాధి సోకి మరణించినట్లు ఆయన చెప్పారు. ఏదేమైనప్పటికీ అంతరించిపోతున్న అటవీ మృగాలను సంరక్షించికోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మోలౌక్‌పౌర్ అభిప్రాయపడ్డారు. లేకపోతే భావితరాలకు చరిత్రలో ఓ ఘట్టంగా మిగిలిపోయిన డైనోసార్లు మాదిరిగానే పులులు, సింహాలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+