హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అఖిలపక్షానికి వెళ్లడంపై పార్టీలో నిర్ణయిస్తాం: ఈటెల రాజేందర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Etela Rajender
హైదరాబాద్: త్వరలో కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ రెండోసారి నిర్ణయించే అఖిలపక్ష సమావేశానికి వెళ్లాలా వద్దా అనే విషయంపై పార్టీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభానేత ఈటెల రాజేందర్ మంగళవారం పార్టీ సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. 2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు. 56 సంవత్సరాల సమైక్యాంధ్రలో తెలంగాణకు అడుగడుగునా అన్యాయమే జరిగిందన్నారు.

ఎన్ని ఒప్పందాలు ఉన్నా తెలంగాణ అన్యాయానికి గురవుతుందన్నారు. తెలంగాణకు న్యాయం చేయాలంటే నిరంతరం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. నిత్యం పోరాటం కన్నా ప్రత్యేక తెలంగాణతోనే మాకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు విజ్ఞత ఉంటే వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నివేదిక తెలంగాణకు అనుకూలంగా లేకుంటే రాజీనామా అన్న నేతలు ఇప్పుడు రాజీనామాలతో తెలంగాణ వస్తుందని అని అనటం విడ్డూరంగా ఉందన్నారు. శవాలపై ప్రమాణాలు చేసిన ఆ నేతలకు ప్రజలే బుద్ది చెబుతారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X