నేటి నుండి విశాఖ జిల్లాలో వైయస్ జగన్ రెండవ విడత ఓదార్పు

YS Jagan
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి రెండవ విడత ఓదార్పు యాత్ర మంగళవారంనుండి ప్రారంభమవుతోంది. జగన్ హైదరాబాదునుండి నేరుగా రాజమండ్రి వెళతారు. అక్కడినుండి ఓదార్పుకు వెళతారు. జిల్లాలో రెండవ విడత ఓదార్పు పాయకరావుపేటనుండి ప్రారంభమవుతుంది. ఈ ఓదార్పులో జిల్లాలో ఆరుగురిని జగన్ ఓదార్చనున్నారు. ఈరోజు ఇద్దరిని ఓదారుస్తారు. ఓదార్పు యాత్ర ఈ నెల 22వ తేది వరకు జరుగుతుంది. 22న ఓదార్పు యాత్ర పూర్తయ్యాక విశాఖ జగదాంబ సెంటర్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తారని సమాచారం.

కాగా ఈ నెల 12వ తేది వరకు విశాఖ ఓదార్పుయాత్ర పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ న్యూఢిల్లీలో జగన్ జలదీక్ష చేపట్టిన కారణంగా ఓదార్పుయాత్రను అనుకున్న తేదికంటే ముందుగా ఆపేశారు. ఆ తర్వాత ఢిల్లీ జలదీక్ష అయిన తర్వాత ఓదార్పు చేపడతామని ప్రకటించారు. జలదీక్ష తర్వాత విశాఖలో ఈరోజు నుండి ఓదార్పుకు జగన్ సిద్ధమయ్యారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఓదార్పు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+