కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు ఆలూరు ఎమ్మెల్యే నీరజా రెడ్డిపై అరెస్టు వారంట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Neeraja Reddy
కర్నూలు: జంట హత్య కేసులో కర్నూలు జిల్లా ఆలూరు కాంగ్రెసు శాసనసభ్యురాలు నీరజారెడ్డిపై ఆరెస్టు వారంట్ జారీ అయింది. ప్రభాకర్ రెడ్డి, అతని బావమరది హత్య కేసులో కర్ణాటక రాజధాని బెంగళూర్ పోలీసులు ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ అయింది. 2008లో ప్రభాకర్ రెడ్డిని, అతని బావమరిదిని ఓ భూవివాదం పరిష్కారం కోసం ప్రత్యర్థులు పిలిచారు. తమను పిలిచినవారు శత్రువులని తెలియక వారిద్దరు బెంగళూర్ వెళ్లారు. బెంగళూర్ ‌లో వారిద్దరిని అన్నంలో విషం కలిపి చంపారు. శవాలను నగర శివార్లలో పారేశారు.

ఆ జంట హత్య కేసులో 11 మంది నిందితులు. వీరిలో 8 మంది కడప జిల్లాకు చెందినవారే. కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురిలో నీరజా రెడ్డి ఒకరు. నీరజారెడ్డి భర్త 2002లో హత్యకు గురయ్యారు. ఆ హత్యలో ప్రభాకర్ రెడ్డిది ప్రధాన పాత్ర అనే అనుమానాలున్నాయి. దానికి ప్రతీకారంగానే నీరజారెడ్డి ప్రభాకర్ రెడ్డిని హత్య చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం నీరజా రెడ్డిని బెంగళూర్ పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చునని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X