బాబుతో ముదిరిన విభేదాలు, అజ్ఞాతంలోకి వెళ్తానన్న నాగం

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి, ఆ పార్టీ తెలంగాణ ప్రాంత నాయకుడు నాగం జనార్దన్ రెడ్డికి మధ్య విభేదాలు ముదిరి పాకాన పడినట్లు అర్థమవుతోంది. నాగం జనార్దన్ రెడ్డి బుధవారం మీడియా ప్రతినిధుల ఇష్టాగోష్టిలో చేసిన సంచలన ప్రకటన ఆ విషయాన్ని తెలియజేస్తోంది. తెలంగాణకు ప్రత్యేక కమిటీ వేసే విషయంపై వెనక్కి తగ్గేది లేదని నాగం జనార్దన్ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటుపై తాను చంద్రబాబుకు గడువు ఇచ్చానని, గడువులోగా చంద్రబాబు స్పందించకపోతే కార్యకర్తలే ఆ విషయం తేలుస్తారని ఆయన అన్నారు.

పార్టీ ఎవరబ్బ సొత్తు కాదని, పార్టీ పెట్టినప్పటి నుంచి తాను ఉన్నానని ఆయన అన్నారు. ఎవరో పంపిస్తే తాను పార్టీ నుంచి వెళ్లిపోయేది లేదని ఆయన చెప్పారు. అవసరమైతే తాను అజ్ఞాతంలోకి వెళ్తానని ఆయన అన్నారు. నాగం జనార్దన్ రెడ్డితో మరింత మంది పార్టీ శాసనసభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక శాఖ ఏర్పాటు డిమాండ్‌పై ఇంతకు ముందు పార్టీలో పుట్టిన ముసలం టీ కప్పులో తుఫానుగా తేల్చేశారు. అయితే, అది సద్దుమణగలేదని, అది గాలివానగా మారే ప్రమాదం ఉందని అర్థమవుతోంది. తాను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గబోనని, తెలంగాణ విషయంలోనూ అంతేనని నాగం అన్నారు. తెలంగాణ ప్రత్యేక కమిటీ ఏర్పాటుపై చంద్రబాబు నాయకులతో మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+