హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేటినుండి మూడు రోజులపాటు ప్రభుత్వ ఉద్యోగుల పెన్‌ డౌన్‌

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: దీర్ఘకాలంగా పరిష్కారం కాకుండా ఉన్న డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు బుధవారం నుండి పెన్‌డౌన్‌ నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు ఉద్యోగులు పెన్ ‌డౌన్‌ ఆందోళన నిర్వహించనున్నారు. ఉద్యోగులు పెన్‌డౌన్‌ ఆందోళన ప్రకటించడంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశమైనా ఫలితం తేలలేదు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నా ఉద్యోగులు పెట్టిన 11 డిమాండ్లలో కేవలం మూడునాలుగింటికే ప్రభుత్వం అంగీకరించింది.

బీమాతో కూడిన హెల్తు కార్డుల జారీకి సర్కారు మొగ్గు చూపిన ప్రభుత్వం, అర్హతను బట్టి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని అందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. అయితే మిగతా డిమాండ్లపై ప్రభుత్వం స్పందించలేదు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ బీమా ప్రమేయం లేని హెల్తుకార్డుల జారీని ఆమోదించలేదు. దీంతో ఉద్యోగులు తమ ఆందోళనను యథావిదిగా నిర్వహించాలను నిర్ణయించుకున్నారు. బుధ, గురు, శుక్ర మూడు రోజుల పాటు పెన్‌డౌన్‌ నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5లక్షలమంది ఉద్యోగులు ఈ ఆందోళనలో పాల్గొననున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X