వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌ లో చోటుకు ఎపి నుంచి పలువురు పోటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధాని బుధవారం సాయంత్రం ఐదు గంటలకు తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించనున్నారు. మంత్రి పదవుల కోసం రాష్ట్రం నుంచి పలువురు పోటీ పడుతున్నారు. అయితే, రాష్ట్రం నుంచి కొత్తగా ఇద్దరి మాత్రమే మంత్రివర్గంలో చోటు లభిస్తుందని భావిస్తున్నారు. కిశోర్ చంద్రదేవ్, వి. హనుమంతరావులకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే, కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కాగా, సీనియర్ నేత కె. కేశవరావు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కాగా, తెలంగాణ కోటాలో పొన్నం ప్రభాకర్, మందా జగన్నాథం మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు.

కాగా, 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కారణంగా రాజీనామా చేసిన డిఎంకె నేత ఎ. రాజా స్థానంలో అదే పార్టీకి చెందిన టిఆర్ బాలుకు మన్మోహన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చునని భావిస్తున్నారు. మరికొన్ని మంత్రి పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో యువతకు ప్రధాని ప్రాధాన్యం ఇస్తారని అంటున్నారు. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసుకు మరో మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X