హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్టీ నేతలతో చిరంజీవి భేటీ: కాంగ్రెసులో విలీనమా, పొత్తా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: కాంగ్రెసు అధ్యక్షురాలు తనను ఢిల్లీకి ఆహ్వానించిన నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి మంగళవారం పార్టీ ముఖ్య నాయకులతో, శాసనసభ్యులతో సమావేశమయ్యారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలని లేదా తమ పార్టీతో పొత్తుకు అంగీకరించాలని కాంగ్రెసు అధిష్టానం చిరంజీవిని కోరింది. దీనిపై చిరంజీవి పార్టీ నాయకులతో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో అల్లు అరవింద్‌తో పాటు శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, కన్నబాబు, అనంత శ్రీనివాసరావు తదితరులు సమావేశమయ్యారు. సమావేశానికి 9 మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

వెంటనే విలీనానికి సిద్ధపడకూడదని సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. క్రమంగా విలీనం దిశగా సాగాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీకి నాలుగు మంత్రి పదవులు ఇస్తామని కాంగ్రెసు అధిష్టానం చెప్పినట్లు తెలుస్తోంది. చిరంజీవి ఈ నెల 9వ తేదీన ఢిల్లీకి వెళ్లి 10వ తేదీన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాను కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. సమావేశానంతరం తిరుపతిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లారు. తాజా పరిణామాల నేపథ్యంలో తిరుపతి రచ్చబండ కార్యక్రమాల్లో చిరంజీవి ఫ్లెక్సీలు విరివిగా కనిపిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X