హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసులో విలీనానికి ప్రజారాజ్యం కార్యవర్గం ఏకగ్రీవ తీర్మానం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీనానికి సాంకేతికపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. చిరంజీవి అధ్యక్షతన మంగళవారం జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గం కాంగ్రెసులో తమ పార్టీ విలీనం ప్రతిపాదనను ఆమోదిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తామని ఢిల్లీలో ప్రకటించిన వచ్చిన చిరంజీవి సోమవారం సాయంత్రం పార్టీ శాసనసభ్యులతో సమావేశమయ్యారు. మంగళవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో అల్లు అరవింద్‌తో పాటు మిగతా సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

చిరంజీవి మంగళవారం ఉదయం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను కలిశారు. తనతో పాటు వచ్చిన శాసనసభ్యులను, నాయకులను ఆయన శ్రీనివాస్‌కు పరిచయం చేశారు. అనంతరం డిఎస్‌తో ఆయన ఏకాంత చర్చలు జరిపారు. ఈ చర్చల్లో తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై వారిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. చిరంజీవితో కాటసాని రాంరెడ్డి, శోభానాగిరెడ్డి మినహా మిగతా 16 మంది శాసనసభ్యులు ఉన్నారు.

English summary
PRP Executive decides for merger
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X