ముఖ్యమంత్రి బంగళాను తనఖా పెట్టండి: దేవేందర్ గౌడ్ ఆగ్రహం

బోధనా ఫీజుల చెల్లింపులకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవనే వాదనను ఆయన వ్యతిరేకించారు. ప్రభుత్వాదాయం వేల కోట్ల రూపాయలు పెరిగిందని, అయినా బోధనా ఫీజుల చెల్లింపులకు డబ్బులు లేవని వాదించడం సరైంది కాదని ఆయన అన్నారు. అది ప్రభుత్వ పెత్తందారీ విధానానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. వాణిజ్య ప్రకటనల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం బడుగుల ఫీజులపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. బిసిల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications