సూట్‌కేసులన్నీ జగనే పట్టుకెళ్లారు, మా దగ్గరెక్కుడున్నాయి: విహెచ్

V Hanumantha Rao
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్, రహేజా వంటి గతంలో జరిగిన అవినీతి కార్యకలాపాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తారని ఆశిస్తున్నానని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. అలా స్పందిస్తే కాంగ్రెసు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఆయన అన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అవినీతిపై సమయం వచ్చినప్పుడు దర్యాప్తు జరుగుతుందని ఆయన అన్నారు.

అవినీతికి రాజకీయ వ్యవస్థ కారణం అని మాజీ న్యాయమూర్తులు అనడం సబబు కాదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. కడప మాజీ ఎంపీ జగన్, తనపై వచ్చిన ఆరోపణలను పక్కదారి పట్టించేందుకే ప్రత్యారోపణలు చేస్తున్నారంటూ వీహెచ్ మండిపడ్డారు. సూట్‌కేసులన్నీ ఆయనే పట్టుకెళ్లారని, ఇంకా తమ వద్ద ఎక్కడున్నాయని వీహెచ్ చమత్కరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకే తెలియదని విహెచ్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+