హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ కోసం మంత్రుల ఇళ్లు ముట్టడి, నిజామాబాద్‌లో లాఠీఛార్జ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణవాదులు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల ఇళ్లముందు బుధవారం ఆందోళనకు దిగారు. హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డి, భారీ నీటి పారుదల శాఖామంత్రి సుదర్శన్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి తదితరుల ఇళ్ల ముందు తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ ప్రజలు బుద్ది చెబుతారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి, మంత్రులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తెలంగాణవాదులు మహేశ్వరంలోని హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు వారి ముట్టడిని అడ్డుకొని వారిని అరెస్టు చేశారు. ఉప్పల్ శాసనసభ్యుడు బండారు రాజిరెడ్డి ఇంటి వద్ద తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో మంత్రి సుదర్శన్ రెడ్డి ఇంటిముందు ఎబివిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఫీజు రీయింబర్స్‌మెంట్స్ వెంటనే చెల్లించాలంటూ ఎబివిపి కార్యకర్తలు మంత్రిని డిమాండ్ చేశారు. పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు.

English summary
Telanganites organized dharna at Ministers and MLAs residence on wednesday. They demanded Home Minister Sabitha Indra Reddy, Major Irrigation Minister Suddharshan Reddy and Uppal MLA Bandaru Raji Reddy to resign. Police lathi charged ABVP followers in Nizamabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X