అసెంబ్లీ దృశ్యాల లీకేజీ దుమారం, పథకం ప్రకారం కిరణ్ కుమార్ రెడ్డి పనే

గవర్నర్ ప్రసంగం సందర్భంగా గురువారం ఉదయం శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపి శాసనసభ్యులు ప్రయత్నించారు. మైకులు విసిరేశారు. ప్రసంగ ప్రతులు చించి విసిరేశారు. ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలను తొలగించాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా వాటిని ప్రభుత్వం కొన్ని ఎంపిక చేసిన టీవీ చానెళ్లకు అందించినట్లు, కొన్ని చానెళ్లకు నిరాకరించినట్లు చెబుతున్నారు. లీకేజీ వ్యవహారంలో డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ను పావుగా వాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications