భూగర్భంలో దాగున్న నిగూఢ జలనిధి!

ఇప్పటివరకు మనం చదువుకున్న సైన్స్ ప్రకారం.. భూమి ఏర్పడిన తొలినాళ్లలో అంతరిక్షం నుంచి మంచుతో కూడిన తోకచుక్కలు (Comets) వచ్చి ఢీకొట్టడం వల్లే మనకు సముద్రాలు ఏర్పడ్డాయని నమ్ముతూ వచ్చాం. కానీ, సరికొత్త జియోలాజికల్, సీస్మిక్ పరిశోధనలు ఈ పాత సిద్ధాంతాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తున్నాయి. ఈ ఆవిష్కరణతో భూమిపై నీటి చక్రం (Water Cycle) గురించిన పరిశోధనలు సరికొత్త మలుపు తిరిగాయి.

700 కిలోమీటర్ల లోతులో.. కానీ అది 'లిక్విడ్' కాదు!

భూమి పైపొర (Crust) కు దాదాపు 700 కిలోమీటర్ల లోతున ఉండే 'మాంటిల్' పొరలో ఈ భారీ నీటి నిల్వలు ఉన్నాయి. అయితే, ఇది మనం చూసే నదులు, సముద్రాల లాగా ప్రవహించే నీరు కాదు. అక్కడ ఉండే విపరీతమైన ఒత్తిడి, అత్యధిక వేడి కారణంగా నీరు ద్రవరూపంలో ఉండలేదు. అది 'రింగ్‌వుడైట్' (Ringwoodite) అనే ఒక ప్రత్యేకమైన ఖనిజం యొక్క స్ఫటిక నిర్మాణంలో (Crystal Structure) రసాయనికంగా బంధించబడి ఉంటుంది. ల్యాబొరేటరీ ప్రయోగాల ద్వారా ఈ 'రింగ్‌వుడైట్' ఖనిజం తనలో ఊహించని పరిమాణంలో నీటిని దాచుకోగలదని శాస్త్రవేత్తలు నిరూపించారు. భూమి లోపల జరిగే ప్లేట్ టెక్టోనిక్స్ (భూఫలకాల కదలికలు)పై కూడా ఈ నిగూఢ జలనిధి ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.

Massive Hidden Ocean Found 700km Below Earth s Crust Total Water Volume Surpasses Surface Oceans Combined

భూమి పుట్టినప్పటి నుంచే ఆ నీరు ఉంది..

ఈ సరికొత్త పరిశోధన ద్వారా భూమిపై నీటి ఆవిర్భావం గురించి ఒక సరికొత్త సిద్ధాంతం తెరపైకి వచ్చింది. సముద్రాల్లోని నీరు అంతరిక్షం నుండి వచ్చినది కాదు.. భూమి ఏర్పడినప్పుడే ఈ నీరు కూడా అందులో ఒక భాగమైంది. కాలక్రమేణా భారీ అగ్నిపర్వతాల పేలుళ్లు, ఇతర భూగర్భ మార్పుల ద్వారా లోపల ఉన్న నీరు క్రమంగా పైపొరలకు చేరి నేటి సముద్రాలుగా మారాయని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు. భూమిపై యుగాలుగా సముద్రాల నీటి పరిమాణం స్థిరంగా ఉండటానికి కూడా ఇదే కారణం కావచ్చని వివరిస్తున్నారు.

భూమికి జ్వరం. మరో 3 ఏళ్లలో భూమి బద్ధలైపోతుందా?
భూమికి జ్వరం. మరో 3 ఏళ్లలో భూమి బద్ధలైపోతుందా?

700 కిలోమీటర్ల లోతులోని గుట్టు విప్పింది ఎలా?

టెక్నాలజీ ఎంత పెరిగినా భూమి లోపలికి 700 కిలోమీటర్ల లోతుకు నేరుగా వెళ్లడం మనుషులకు అసాధ్యం. మరి శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఎలా కనుగొన్నారంటే.. భూకంప తరంగాల (Seismic Waves) ద్వారా! భూకంపాలు వచ్చినప్పుడు వెలువడే తరంగాలు భూమి లోపలి పొరల్లో ప్రయాణించేటప్పుడు, అవి ఎదుర్కొనే పదార్థాలను బట్టి వాటి వేగం మారుతుంది. కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో ఈ తరంగాల వేగం అకస్మాత్తుగా తగ్గడాన్ని పరిశోధకులు గమనించారు. ఖనిజాల లోపల నీరు ఉంటేనే తరంగాలు అలా మందగిస్తాయి.

రెండు ముక్కలు కాబోతున్న ప్రపంచం? భూమిపై సరికొత్త మహాసముద్రం
రెండు ముక్కలు కాబోతున్న ప్రపంచం? భూమిపై సరికొత్త మహాసముద్రం

దీనికి తోడు, 'ష్మాండ్ & జాకబ్సన్' అనే శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం.. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు లోపలి నుంచి పైకి వచ్చిన వజ్రాలను (Diamonds) పరీక్షించగా, వాటి లోపల చిక్కుకున్న 'రింగ్‌వుడైట్' శాంపిల్స్ దొరికాయి. వాటిని ల్యాబ్‌లో క్షుణ్ణంగా పరీక్షించగా అందులో నీటి అణువులు ఉన్నట్లు ల్యాబ్ ప్రయోగాల్లో 100% స్పష్టమైంది. ఈ అద్భుతమైన పరిశోధన వివరాలు ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ 'నేచర్' (Nature) లో ప్రచురితమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+