కెసిఆర్ ఆందోళనకు దీటుగా కాంగ్రెసు తెలంగాణ ఎంపీల వ్యూహం

గవర్నర్ నరసింహన్ను తొలగించాలని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరసింహన్ స్థానంలో మరొకరిని గవర్నర్గా నియమించాలని ఆయన కోరారు. ఈ మేరకు రేపు బుధవారం ప్రధాని మన్మోహన్ సింగ్కు వినతిపత్రం సమర్పించాలని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు నిర్ణయించారు. తమకూ కెసిఆర్కు మధ్య పోలిక లేదని వారన్నారు. బిజెపి చేతకానిదని, అందుకే తమ కాంగ్రెసుపై విమర్శలు చేస్తోందని వారన్నారు. మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిన సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాటు చేయలేదని వారు బిజెపిని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications