జగన్, కెవిపిలతో చంద్రబాబు మిలాఖత్: టిఆర్ఎస్ ఆరోపణ

టిఆర్ఎస్ కాంగ్రెస్ బ్రాంచ్ ఆఫీసు అని చంద్రబాబు అన్నాడని, అయితే కెసిఆర్ అవిశ్వాస తీర్మానం సవాల్ విసరడంతో తోకముడిచాడని అన్నారు. జగన్తోనో, కాంగ్రెస్తోనే మిలాకత్ కావాల్సిన అవసరం మాకు లేదన్నారు. అసలు తెలంగాణపై ఏం చేయాలో మొదట చంద్రబాబు నిర్ణయించుకోవాలని సూచించారు. పార్టీ నేతలు తెలంగాణ నేతలు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతుంటే వ్యక్తిగత అభిప్రాయమంటున్నారని, ఇప్పటికైనా తెలంగాణ టిడిపి నేతలు బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. ఆయనకు విద్యార్థుల ప్రాణం, ప్రజల ఆకాంక్ష కంటే పార్టీయే ముఖ్యమైందన్నారు. తీర్మానానికి కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నిస్తే పరిస్థితులు మారాయని అనటం ఏమిటన్నారు. రేపటి 48 గంటల బంద్ ను ఇదే స్ఫూర్తితో బుధవారం ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications