కిరణ్ ప్రభుత్వానికి సిగ్గు లేదు: జగన్ వర్గం పుల్లా పద్మావతి

Pulla Padmavathi
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఐదు రోజులుగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ కోసం దీక్ష చేస్తున్నా సిగ్గులేని ప్రభుత్వం స్పందించడం లేదని జగన్ వర్గం శాసనమండలి సభ్యురాలు పుల్లా పద్మావతి మంగళవారం వరలక్ష్మి ప్రాంగణంలో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని ఆదర్శంగా తీసుకుంటామంటూ, ఆయన ఫోటో పెట్టుకుని ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను సిగ్గు లేకుండా తుంగలో తొక్కుతుందని ప్రభుత్వాన్ని తూర్పార పట్టారు. ప్రజా సంక్షేమం విస్మరించిన ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా అందరూ కుంభకర్ణుల్లా నిద్రపోతున్నారన్నారు. వైయస్ పేరుతో గెలిచిన వారు కూడా ఆయన పథకాలు నీరుగారుతున్నా మాట్లాడటం లేదన్నారు.

శాసనమండలిలో సంక్షేమ పథకాలపై కేవలం కొండా మురళీదరరావు, జూపూడి ప్రభాకరరావు, తాను మాత్రమే ప్రశ్నిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌పై జగన్ దీక్షకు మద్దతుగా రేపు బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీని స్తంభింప జేయాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ దీక్ష ఎందుకు చేస్తున్నారో విద్యార్థులు గుర్తించారని కానీ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు గుర్తించక పోవడం దురదృష్టకరమన్నారు. మేమొక్కరం బావుంటే చాలు, రాష్ట్ర ప్రజలు ఏమైతే ఏమిటనే ధోరణిలో ప్రభుత్వం ఉందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌పై శాశ్వత పరిష్కారం కోసం ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా జగన్ దీక్ష చేస్తున్నారని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అంతకుముందు అన్నారు. జగన్‌కు వస్తున్న ఆదరణ చూడలేకే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+