హైదరాబాదులో పరుచూరి వెంకటేశ్వర రావు భూమి కబ్జా

Paruchuri Venkateswara Rao
హైదరాబాద్: సినీరచయిత పరుచూరి వెంకటేశ్వరరావు స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. విషయం తెలిసిన వెంటనే ఆయన హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్లాటు వద్ద ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారులు మాత్రం పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం - సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావుకు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు-5లోని ఉమెన్స్ కో ఆపరేటివ్ సొసైటీలో 500 గజాల స్థలం ఉంది.

పరుచూరి వెంకటేశ్వర రావు కుమారుడు రవీంద్రరావుకు మామ జేపీ రావు ఆ భూమిని కట్నంగా ఇచ్చారు. కాగా కూకట్‌పల్లికి చెందిన శివవర్మ, భాస్కర్ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. దీనిపై వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్లాటు వద్దకు వెళ్లారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+