హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో పరుచూరి వెంకటేశ్వర రావు భూమి కబ్జా

By Pratap
|
Google Oneindia TeluguNews

Paruchuri Venkateswara Rao
హైదరాబాద్: సినీరచయిత పరుచూరి వెంకటేశ్వరరావు స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. విషయం తెలిసిన వెంటనే ఆయన హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్లాటు వద్ద ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారులు మాత్రం పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం - సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావుకు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు-5లోని ఉమెన్స్ కో ఆపరేటివ్ సొసైటీలో 500 గజాల స్థలం ఉంది.

పరుచూరి వెంకటేశ్వర రావు కుమారుడు రవీంద్రరావుకు మామ జేపీ రావు ఆ భూమిని కట్నంగా ఇచ్చారు. కాగా కూకట్‌పల్లికి చెందిన శివవర్మ, భాస్కర్ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. దీనిపై వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్లాటు వద్దకు వెళ్లారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నారు.

English summary
Film writer Paruchuri Venkateswara Rao's land was illegally occupied by claiming rights. Paruchuri Venkateswara Rao complained to the police on that issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X