చంద్రబాబు చేతిలో బాలయ్య, ఎన్టీఆర్ బిడ్డలు నా బిడ్డలే: లక్ష్మీపార్వతి
గతంలో ఎప్పుడూ జూనియర్ ఎన్టీఆర్ను దగ్గరకు తీయలేదు. కానీ ఇప్పుడు దగ్గరకు తీసుకుంటున్నారన్నారు. బాలకృష్ణ కూతురితో కూడా తన తనయుడికి వివాహం చేసి కుటుంబాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. వారు ఎప్పటికైనా తప్పు తెలుసుకొని చంద్రబాబుతో విభేదించి బయటకు వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేసారు. బాలయ్యబాబుకు తనపై ప్రేమ ఉందన్నారు. ఎన్టీఆర్ బిడ్డలు నా బిడ్డలే అని చెప్పారు.
వారు ఎప్పటికైనా తనతో కలుస్తారనే ఆశతో ఎదురు చూశానని, ఇకముందు కూడా చూస్తానని చెప్పారు. నా కుటుంబం గురించి నేను ఎప్పుడూ అనుచితంగా మాట్లాడలేదన్నారు. వారే ఎవరి మాటలో విని తొందరపాటుగా మాట్లాడుతున్నారన్నారు. బాలయ్య తన ఇంటికి కూడా వచ్చారని అప్పటినుండి తాము మాట్లాడుకున్నది, పోట్లాడుకున్నది లేదన్నారు. బాలయ్యనుండో, ఎన్టీఆర్ కుటుంబం నుండి తనకు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. వారు అటువంటి వ్యక్తులు కాదని చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను నేను ఏమీ అనను అన్నారు.
అయితే ఎన్టీఆర్ ప్రతిష్టను మాత్రం ఎవరూ మసకబారనీయవద్దు అని ఆమె కోరారు. ఎప్పటికైనా వాళ్లు నన్ను కలుపుకుంటారనే ఆశతో ఉన్నానని అన్నారు.