మంత్రులు రాజీనామా చేస్తారు, కాంగ్రెస్దే బాధ్యత: బాలు
కాంగ్రెస్ పార్టీ సీట్ల విషయంలో ఎక్కువగా కోరుతుందన్నారు. అయితే సోమవారం వరకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కోసం ఆగుతామని చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుండి ఎలాంటి ప్రతిపాదన రాకుంటే మా నిర్ణయం మేం తీసుకుంటామని చెప్పారు. కాగా యూపిఏ నుండి డిఎంకె తప్పుకుంటున్న విషయాన్ని కాంగ్రెస్ సీరియస్ తీసుకుంటున్నట్టుగా కనిపించడం లేదు. 2జి స్పెక్ట్రం కేసులో దోషి అయినా రాజా డిఎంకేకు చెందినవాడు. దీంతో కాంగ్రెస్ డిఎంకెకు దూరంగా జరగడానికి సీట్ల కోసం బెట్టు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
బెట్టుతో డిఎంకెకు దూరం అయి ఉత్తరప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాది పార్టీని మంత్రివర్గంలోకి తీసుకునే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సాధారణ ఎన్నికల తర్వాత జరిగే అతి పెద్ద ఎన్నికలు 5 రాష్ట్రాల్లో జరగనున్న నేపథ్యంలో 2జి కుంభకోణం ప్రభావం తమపై పడకుండా డిఎంకెకు దూరం జరిగి ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. 2జి పాపం ఎన్నికలలో పడకుండా ఉండటానికే డిఎంకెకు దూరంగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కాగా జయలలిత కూడా డిఎంకె యూపిఎనుండి తప్పుకుంటే తాము మద్దతు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.