హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వర్గం ఎమ్మెల్యేలతో సిఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన పలువురు శాసనసభ్యులు బుధవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అసెంబ్లీలో కలిశారు. జగన్ సొంత జిల్లా కడప జిల్లాకు చెందిన అమరనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కమలమ్మలతో పాటు కుతూహలమ్మలు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. అయితే ఈ నెల 17వ తారీఖున ఎమ్మెల్యే కోటాలో జరిగే శాసనమండలి ఎన్నికలు ఉన్నందువల్లే ముఖ్యమంత్రి వారిని కలిసినట్లుగా తెలుస్తోంది.

కాగా ఇప్పటికే అధికార కాంగ్రెసు పార్టీ తన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. సికిందరాబాద్ ఎమ్మెల్యే జయసుధ మొదట విప్ తీసుకోవడానికి నిరాకరించినప్పటికీ ఆ తర్వాత వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. పార్టీ సూచించిన అభ్యర్థికి ఓటు వేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఇప్పుడు తాజాగా కడప జిల్లా ఎమ్మెల్యేలతో సిఎం భేటీ అయి మండలి ఎన్నికల విషయం చర్చించినట్టుగా తెలుస్తోంది.

English summary
Ex MP YS Jagan camp mlas met CM Kiran Kumar Reddy today in assembly. Kadapa district mlas amarnath reddy, srikanth reddy and kamalamma were met him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X