రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముగ్గురు భార్యల ముద్దుల ఎన్నారై: ఇంటి ముందు రెండో భార్య ధర్నా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajahmundry
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో చీటింగ్ చేసి మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓ ఎన్ఆర్ఐ భర్త ఇంటి ముందు ఆయన రెండో భార్య సుగుణ ఆందోళనకు దిగిన ఘటన చోటు చేసుకుంది. తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, ఆ తర్వాత ఇప్పుడు మరో పెళ్లి కూడా చేసుకున్నాడని ఆరోపణలు చేస్తూ ఆమె భర్త ఉంటి ముందు ఆందోళనకు దిగింది. దీంతో భర్త ఇంటి వారు అక్కడినుండి జారుకున్నట్లుగా తెలుస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన సుగుణకు అమెరికాలో ఉంటున్న తాడిపత్రికి చెందిన వెంకటేశ్వరరావుతో 2001లో వివాహం జరిగింది. సుగుణ తల్లిదండ్రులు కట్నంగా 10 లక్షల రూపాయలను కూడా ముట్టజెప్పారు. పెళ్లి తర్వాత సుగుణను భర్త అమెరికాకు తీసుకు వెళ్లాడు. అయితే అమెరికాకు వెళ్లిన తర్వాత గానీ సుగుణకు వెంకటేశ్వరరావు గురించి అసలు విషయం బోధపడింది. ఆయన అప్పటికే లక్ష్మీ అనే ఆమెను తనకంటే వివాహం చేసుకున్నట్టుగా తెలిసింది. మొదటి భార్యకు పిల్లలు కూడా ఉన్నారు.

అయినప్పటికీ ఆమె సర్దుకొని ఉండి పోయింది. అయితే 2008వ సంవత్సరంలో ఓ పాప పుట్టిన తర్వాత వెంకటేశ్వరరావు సుగుణను భారత్‌కు పంపించారు. అయితే ఆ తర్వాత ఇప్పటి వరకు సుగుణను తీసుకు వెళ్లలేదు. ఇటీవల అమెరికానుండి వెంకటేశ్వరరావు తిరిగి వచ్చాడు. అనంతరం మరో పెళ్లి కూడా చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఏలేశ్వరంకు చెందిన ఓ మహిళను మూడో భార్యగా చేసుకునేందుకు సిద్ధపడ్డట్లుగా తెలుస్తోంది. దీంతో సుగుణ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాల్సిందిగా ఆమె డిమాండ్ చేస్తోంది. తనకు అన్యాయం చేసిన వెంకటేశ్వరరావును కఠినంగా శిక్షించాలని కోరుతోంది.

English summary
Suguna, who is NRI's second wife take agitation at husband Venkateswara Rao's residence in East Godavari district. She accused on husband's three marriages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X