చంద్రబాబు నుండి నేర్చుకోవాల్సిన అవసరం లేదు: సిఎం కిరణ్

ప్రభుత్వం మూడేళ్ళలో తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఎస్సీ, ఎస్టీ భూములను అభివృద్ధి చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ భూముల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి గురించి ఎవరి నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. రాఘవులు వెంటనే దీక్షను విరమించాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. త్వరలో ఎస్టీ మహిళా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాగా మంత్రి శ్రీధర్బాబు సైతం రాఘవులు దీక్షను విరమించాలని కోరారు.












Click it and Unblock the Notifications