హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు కుమ్మక్కయ్యారా, అవునంటున్న సాక్షి

By Pratap
|
Google Oneindia TeluguNews

Sakshi
హైదరాబాద్: స్థానిక సంస్థలో కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కమ్మక్కయ్యారంటూ వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి దినపత్రిక ఆరోపించింది. ఈ మేరకు మంగళవారం ఓ భారీ వార్తాకథనాన్ని ప్రచురించింది. నాదీ చిత్తూరే, నీదీ చిత్తూరు అంటే ఇరువురు నాయకులు కమ్మక్కయ్యారని ఆరోపించింది. జగన్ వర్గం అభ్యర్థులను దెబ్బ తీయడమే లక్ష్యంగా వారిద్దరు కలిసి పనిచేశారని వ్యాఖ్యానించింది. వా (ఓ)టేశాకున్నారంటూ శీర్షిక పెట్టి దాని కింద ఇరువురు నేతలపై దుమ్మెత్తి పోసింది. వారిద్దరు ఒక్కటై చిత్తూరు జిల్లా ఎన్నికల్లో ద్వితీయ ప్రాధాన్యతా ఓటును బదలాయించుకున్నారని చెప్పింది.

కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోయినా ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఓటింగులో పాల్గొనడమే వారిద్దరు కుమ్మక్కయ్యారని చెప్పడానికి నిదర్శనమని అభిప్రాయపడింది. తెలుగుదేశం పార్టీకి చెందిన 122 మంది ఎంపిటీసి, ఇద్దరు జెడ్పిటీసిలు, ఐదుగురు మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెసు నాయకుల ఆధ్వర్యంలో ఓటేశారని చెప్పిది. చిత్తూరు జిల్లాలో క్రాస్ వోటింగుకు నిరాకరించిన తెలుగుదేశం, కాంగ్రెసు ప్రతినిధులు వైయస్ జగన్ వర్గానికి చెందిన తిప్పారెడ్డికి ఓటేశారని తెలిపింది. శ్రీకాకుళం, కడప జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ పోటీకి దిగలేదు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కాంగ్రెసు పార్టీకి ఓటేశారని, చంద్రబాబుకూ కిరణ్ కుమార్ రెడ్డికీ మధ్య జరిగిన ఒప్పందం కారణంగానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీకి దిగలేదని సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది.

English summary
Sakshi daily belongs to YS Jagan lashed out at CM Kiran kumar Reddy and Chandrababu in MLC election held under local bodies constituencies. It said hat the leaders were colluded to defeat YS Jagan camp candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X