అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్య సాయి ట్రస్టు బాబా ఆరోగ్యంపై భక్తులను తప్పు దారి పట్టిస్తోందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: సత్య సాయిబాబా ఆరోగ్య పరిస్థితిపై ట్రస్టు తమను పక్కదారి పట్టిస్తోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సత్యసాయి బాబా ట్రస్టు వాస్తవాలను వెల్లడించడం లేదని అంటున్నారు. బయటకు చెబుతున్న విషయాలకు, బయట జరుగుతున్న దానికి పొంతన లేదని అంటున్నారు. బుధవారం కూడా సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ సఫాయా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. బాబా ఆరోగ్యం మెరుగుపడిందని, బాబా మూత్ర పిండాలు కూడా బాగా పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. అయినా బాబా ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.

పుట్టపర్తికి వచ్చే బస్సులను అన్నింటినీ ఆపేశారు. భద్రతా ఏర్పాట్లను పెంచారు. క్విక్ రియాక్షన్ బృందాలను రంగంలోకి దింపారు. హిల్ వ్యూ స్టేడియంలో రెండు లారీల పూలను దింపారు. అక్కడ బారికేడ్లను కూడా నిర్మించారు. దాదాపు 8వేల మంది పోలీసులను పుట్టపర్తిలోకి దించారు. వైద్య బృందం ప్రకటనలో స్పష్టత లేదని అంటున్నారు. బాబా రక్తంపోటు సాధారణ స్థాయిలోనే ఉన్నదని సఫాయా చెప్పారు.

సత్యసాయిబాబాను ఇంకా వెంటలేటర్‌పైనే ఉంచారు. బాబా ఆరోగ్యం మెరుగుపడినట్లు స్పష్టమైన సంకేతాలున్నాయని సఫాయా చెప్పారు. మంగళవారం సాయంత్రం సఫాయా వీడియో బులిటెన్ విడుదల చేసింది. ఈ వీడియో బులిటెన్‌లో కూడా సత్య సాయిబాబా కనిపించలేదు. సత్య సాయిబాబా మార్చి 28వ తేదీన ఆస్పత్రిలో చేరారు.

English summary
Devotees are suspecting Sathya Sai Baba trust regarding Sathya Sai Baba's health. They are alleging that trust is not revealing facts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X