వైయస్ జగన్ లక్ష్యంగా పిజెఆర్ తనయుడు ఎమ్మెల్యే విష్ణు

జగన్కు కాంగ్రెసు శాసనసభ్యులతో పాటు పలువురు మంత్రుల మద్దతు కూడా ఉందని పివిఆర్ సోనియాకు రాసిన బహిరంగ లేఖలో చెప్పారు. జగన్ వెంట వెళుతున్న మంత్రులపై కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వైయస్ పాలన అవినీతిమయంగా సాగిందని, సంక్షేమ పథకాల ముసుగులో దాన్నంతా మూసి పెట్టే ప్రయత్నం చేశారన్నారు. వైయస్ మరణానంతరం జగన్ను ముఖ్యమంత్రిని చేయాలంటూ సాగిన సంతకాల సేకరణలో తాను పాల్గొనలేదని, సంతకం కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రిగా జగన్ ఏనాడూ పరిగణించలేదన్నారు. ఆయనపై ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేశారన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో కొందరు పనిగట్టుకొని జగన్తో ప్రచారం చేయించారని ఆయతే ఫలితం మాత్రం కనిపించలేదన్నారు. తన నియోజకవర్గంలో మాత్రం జగన్ పర్యటించకుండా నిరోధించానని చెప్పారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలలో బాహాటంగానే జగన్ వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెసు ఓటమికి కారణమయ్యారని, అలాంటి వారితో పాటు ఆయనకు అనుకూలంగా వ్యవహరించే మంత్రులపై చర్యలు తీసుకోవాలని పివిఆర్ కోరారు. జగన్ వర్గం నేతలపై సిఎం కిరణ్ కఠినంగానే ఉన్నారని అయితే మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన లేఖలో అభిప్రాయపడ్డారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications