హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

27న తెలంగాణ ఉద్యమ దశాభ్ది బహిరంగ సభ: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: ఈ నెల 27వ తేదీన సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ ఉద్యమ దశాబ్ది బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు. తమ పార్టీ ఆవిర్భవించి పదేళ్లు అయిన సందర్భంగా తెలంగాణ ఉద్యమ దశాబ్ది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి పది రోజుల పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉద్యమ దశాబ్ది కార్యక్రమాలు జరుగుతాయని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ జెండా పెండుగ జరుగుతుందని ఆయన చెప్పారు. చివరి రోజున జిల్లా జాతరలు జరుగుతాయని ఆయన అన్నారు.

ఈ నెల 14, 15, 16 తేదీల్లో హైదరాబాదు సమీపంలోని గండిపేటలో చండీ యాగం నిర్వహిస్తామని, తెలంగాణ రాష్ట్ర సిద్ధి కోసం ఈ యాగం నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికకు నిరసనగా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయం పరమ కిరాతకంగా ఉందని ఆయన చెప్పారు. వచ్చే ఉగాది కూడా సమైక్యాంధ్రలోనే నిర్వహించుకుంటామని తెలుగుదేశం పంచాంగ కర్త గార్గేయ చెప్పడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని గార్గేయనే చెప్పారని, ఏమైందో అందరికీ తెలుసునని ఆయన అన్నారు.

English summary
TRS president K Chandrasekhar Rao said that A public meeting will be held on the occasion of Telangana ten years movement on April 27.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X