జగన్‌ను కడప ఓటర్లు మోసం చేయరు: ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి

Pulla Padmavathi
కడప: కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభకు జరుగుతున్న ఉప ఎన్నికలలో కడప జిల్లా ప్రజలు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మోసం చేయరని శాసనమండలి సభ్యురాలు పుల్లా పద్మావతి శుక్రవారం అన్నారు. శుక్రవారం జగన్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆమె పాల్గొని విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని ఓటర్లు మోసం చేయరని అన్నారు. ఎంతమంది ఏకమైనా జగన్ గెలుపును అడ్డుకోలేరని అన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు వైయస్ వారసత్వం కాంగ్రెసు పార్టీది అని చెబుతున్నారని కానీ అసలైన వైయస్ వారసులం తామేనని చెప్పారు. వైయస్‌ని తామంతా గుండెల్లో పెట్టుకున్నామన్నారు.

జగన్, విజయమ్మలను విమర్శించిన వారికి కడప జిల్లా ప్రజలు జీవితాంతం గుర్తుండేలా బుద్ధి చెబుతారని తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. జగన్ నాయకులను నమ్ముకొని రాలేదని ప్రజలను నమ్ముకొని వచ్చిన వాడన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ డి శ్రీనివాస్, మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఎన్ని కుట్రలు చేసినా జగన్ విజయాన్ని అడ్డుకోలేరని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+