పోరాట యోధులు పుట్టిన తెలంగాణలో పుట్టడమే సిగ్గుచేటు: కెటిఆర్

శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంలో భాగంగానే ప్రభుత్వం 177 చట్టం తీసుకు వచ్చిందన్నారు. 177 చట్టంని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే ప్రత్యక్ష యుద్ధానికి దిగుతామని హరీష్రావు హెచ్చరించారు. విలీనం దిశలో టిడిపియే ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. టిడిపి నేతలు టిఆర్ఎస్ పార్టీని, కెసిఆర్ను విమర్శించడం మానుకోవాలని అన్నారు. లేదంటే తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
కాగా పోరాట యోధులు పుట్టిన గడ్డపై మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎర్రబెల్లి దయాకరరావులు పుట్టడం సిగ్గు చేటు అని సిరిసిల్ల శాసనసభ్యుడు కె తారక రామారావు అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అధికార కాంగ్రెసు ప్రభుత్వం నీరుగార్చాలని చూస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చాంబర్ ముట్టడిస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications