వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కడప ఉప ఎన్నికల తర్వాత మధ్యంతర ఎన్నికలు: సబ్బం హరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabbam Hari
విశాఖపట్నం: కడప ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. కడప పార్లమెంటు నుండి జగన్, పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి విజయమ్మ తప్పకుండా గెలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఇలా ఉండవని చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని అన్నారు.

తాను కూడా కాంగ్రెసు పార్టీతో బంధనాలు తెంచుకొని జగన్ పార్టీలో చేరతానని చెప్పారు. జగన్ పార్టీలో చేరి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్రను పోషిస్తానని చెప్పారు. త్వరలో జగన్ పార్టీలో చేరనున్నట్టు చెప్పారు. కాగా ఆయన కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పటికీ గత కొంతకాలంగా జగన్‌కు మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

English summary
Anakapalli MP Sabbam Hari said today that mid-term election may come after Kadapa bypoll. he said he will join in Ex MP YS Jagan's party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X