చిరంజీవి పిఆర్పీ విలీనం నిర్ణయం పవన్ కల్యాణ్కు తెలియదా?

శోభారాణి వ్యాఖ్యల ద్వారా విలీనం నిర్ణయం తమ్ముళ్లకు చెప్పకుండానే జరిగిందని తెలుస్తోంది. కేవలం బావమరిది అల్లు అరవింద్ నిర్ణయం ప్రకారం తనకు దగ్గరగా ఉన్న సి.రామచంద్రయ్య తదితరులకు మాత్రమే చెప్పి అంతిమ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళుతున్న పిఆర్పీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డిలపై వేటుకు కూడా పార్టీ సిద్ధ పడక పోవడానికి కారణం విలీనం విషయం వారికి తెలియక పోవడమే అని తెలుస్తోంది. విలీనాన్ని వ్యతిరేకిస్తూ వాసిరెడ్డి పద్మ కూడా ఇప్పటికే జగన్ పంచన చేరారు.
ముఖ్యంగా పవన్ కల్యాణ్ గత కొన్నాళ్లుగా బయటకు రాక పోవడానికి కారణం కూడా విలీనంపై ఆయనకు తెలియక పోవడమే అని శోభారాణి వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీ అనుకున్నన్ని సీట్లు గెలవనప్పటికీ ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందన్న అభిప్రాయం పవన్లో ఉందని, అందుకే ఆయనకు విలీనం ఇష్టం లేదనే వాదనలు వినిపించాయి. అందుకే అన్న పార్టీ కోసం అహర్నిషలు శ్రమించిన తమ్ముళ్లు నాగబాబు, పవన్లు ప్రస్తుతానికి చిరంజీవికి దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications