వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్యసాయి భక్తులను చీట్ చేశారు: బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Taslima Nasreen
హైదరాబాద్: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా తన సేవామార్గం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచారు. అయితే ఆయన సేవతో ఎంతగా భక్తుల మదిలో నిలిచారో అలాగే కొందరు ఆయనపై విమర్శలు కూడా చేశారు. అయితే ఆయనపై కాంట్రవర్సీ వచ్చినప్పటికీ మరణం తర్వాత కూడా కాంట్రవర్సీలు వస్తున్నాయి.

కోట్లాది భక్తులను విడిచి వెళ్లిన తర్వాత కూడా ఆయనను వివాదాలు వీడనట్టుగా కనిపిస్తోంది. ఆయన మరణం తర్వాత చాలామంది ఆయన సాధారణ వ్యక్తియా లేక భగవత్ స్వరూపుడా అని ప్రశ్నించుకున్నారు. అయితే దానికి భక్తులు భగవత్ స్వరూపుడనే సమాధానం ఇస్తారు. అయితే విమర్శకులు మాత్రం ఇప్పటికీ ఆయన సూపర్ మ్యాజిక్ పవర్ మీద ప్రశ్నలు సంధిస్తున్నారు.

ప్రముఖ రచయిత తస్లీమా నస్రీన్ కూడా బాబా మరణం తర్వాత తన ట్విట్టర్‌లో బాబా సాధారణ మానవమాత్రుడు. ఇంకా చెప్పాలంటే కోట్లాది ఇతని భక్తులను చీట్ చేశారని ట్విట్టర్‌లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. బాబా గతంలో తాను 96 ఏళ్ల వయస్సులో, 2022లో మరణిస్తానని చెప్పారని గుర్తు చేశారు. అంతేకాదు చేసిన మంచి పనులు చూపించడం ద్వారా భక్తులను చీట్ చేశామనే విషయం నుండి తప్పించుకోలేరని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

సాయిబాబా 94 ఏళ్ల వయసులో మరణిస్తానని భక్తులను ఇచ్చిన మాట మీద నిలబడలేదని, అలాంటప్పుడు ఆయన దేవుడు ఎలా అవుతారని ఇప్పటికైనా ప్రజలు ఆయన దేవుడు కాదు మానవమాత్రుడు అని తెలుసుకోవాలని సూచించారు. అయినా బాబాను తస్లీమా నస్రీన్ ఒక్కరే విమర్శించలేదు. చాలామంది సత్యసాయిని విమర్శించారు. అయినా ఆయన తన సేవ పంథను మాత్రం వీడలేదు.

English summary
The renowned controversial writer Taslima Nasreen from her Twitter account said, "Now what exactly do u want to say? He was a normal human being! He was actually..he cheated on crores of his followers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X