హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుట్రతోనే అక్బరుద్దీన్‌పై దాడి, సూత్రదారులను కనిపెడతాం: ఎకె ఖాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
హైదరాబాద్: ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీపై కుట్రతోనే దాడి జరిగిందని ప్రాథమిక సమాచారంలో తెలిసిందని నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ చెప్పారు. ఈ కేసులో ఇప్పటికి పహిల్వాన్‌తో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, మిగతా వారిని కూడా మంగళవారం లోగా పట్టుకుంటామని చెప్పారు. నిందితులు ఉపయోగించిన ఆయుధాలను నిర్ధారించినట్లు చెప్పారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.

రేపటిలోగా దర్యాఫ్తు పూర్తవుతుందని చెప్పారు. దాడికి గల కారణాలు ఆరా తీస్తామని చెప్పారు. దాడి వెనుక సూత్రదారులు ఎవరో తేలుస్తామని చెప్పారు. అక్బర్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. భూతగాదాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. కాగా అక్బరుద్దీన్‌పై దాడి కేసులో టాస్క్ ఫోర్స్ పోలీసుల ముందు ఐదుగురు వ్యక్తులు లొంగిపోయారు. వహలాన్, ఈఎస్యే, యాహ్యా, ఫజల్, పైసల్ అనే వారు పోలీసులు ముందు లొంగిపోయారు. వీరి పహిల్వాన్‌కు సన్నిహితులుగా తెలుస్తోంది.

English summary
Police Commissioner AK Khan was suspected that conspiracy has been hatched to kill MIM MLA Akbaruddin Owaisi. He said Akbar health is stable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X