నష్ట నివారణ దిశగా జగన్, రామోజీ సహా మీడియాపై నిప్పులు
ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీవీ9 తనకు వ్యతిరేకింగా ప్రచారం సాగిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి అందరూ ఒక్కటయ్యారని, ఇందులో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పాత్ర కూడా ఉందని ఆయన అన్నారు. బిజెపి నాయకుడు గాలి జనార్దన్ రెడ్డికి తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి కడప జిల్లాలో ఉక్కు కర్మాగారానికి అనుమతి ఇచ్చారని, అప్పుడు ఏమీ మాట్లాడని కాంగ్రెసు నాయకులు ఇప్పుడు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు, ఆ పార్టీ నాయకత్వం దిగజారిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. తాము గెలిస్తే ముస్లింలకు 4 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన చెప్పారు.
Comments
English summary
YSR Congress party candidate YS jagan lashed out at Eenadu Ramoji Rao, Andhrajyothy, Chandrababu Naidu and TV9.
Story first published: Tuesday, May 3, 2011, 15:28 [IST]