గెలిస్తే ఆయనకే నష్టం: వైయస్ జగన్పై డిఎల్ రవీంద్రారెడ్డి నిప్పులు

సాక్షి మీడియాలో ఇష్టం వచ్చినట్లు వార్తలు రాశారని అన్నారు. సోనియా పదవులు వదులుకున్న త్యాగమూర్తి అన్నారు. జగన్ పదవుల కోసం ప్రాకులాడుతున్న వ్యక్తి అన్నారు. సోనియా కాలిగోటికి కూడా సరిరారన్నారు. ఉప ఎన్నికల్లో మంత్రులు బాగా కష్టపడ్డారన్నారు. ఫలితాలు సానుకూలంగానే వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణలో కలెక్టర్ శశిభూషణ్ పూర్తిగా విఫలం అయ్యారని ఆరోపించారు. తాను ఉప ఎన్నికల సందర్భంగా దాడులు చేశారనే ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు. తాను ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడలేదన్నారు. ఉప ఎన్నికల్లో జగన్ గెలిస్తే అతనికే నష్టం అని చెప్పారు.












Click it and Unblock the Notifications